ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్..

| Edited By:

Apr 12, 2020 | 5:24 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా ప్రభావంతో దేశంమొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో దేశప్రధానిపైనే అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా.. తమిళనాడులో కూడా మరో ముగ్గురు వాట్సప్‌లో ప్రధాని మోదీపై అసభ్య రీతిలో పోస్టులు పెట్టి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..రాష్ట్రానికి చెందిన రామనాథపురం సమీపంలో ఓ ముగ్గురు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ […]

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురి అరెస్ట్..
Follow us on

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా ప్రభావంతో దేశంమొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో దేశప్రధానిపైనే అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా.. తమిళనాడులో కూడా మరో ముగ్గురు వాట్సప్‌లో ప్రధాని మోదీపై అసభ్య రీతిలో పోస్టులు పెట్టి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..రాష్ట్రానికి చెందిన రామనాథపురం సమీపంలో ఓ ముగ్గురు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండంతో అక్కడి స్థానిక బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. పాశిపట్టణంకు చెందిన శీని, ఇబ్రహీంనయనార్‌, ఫాతిమా అనే ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.