తెలంగాణలో 41 వేలకు చేరిన కేసులు.. ఇవాళ ఒక్కరోజే 1,676..

| Edited By:

Jul 16, 2020 | 10:54 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వెయ్యికిపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాటికి..

తెలంగాణలో 41 వేలకు చేరిన కేసులు.. ఇవాళ ఒక్కరోజే 1,676..
Follow us on

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వెయ్యికిపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాటికి 41 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని రాష్ట్ర వ్యాప్తంగా 27,295 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 13,328 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలో నమోదవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 396 మంది మరణించారు.