కరోనా అనుమానమే పెను భూతమై.. చివరకు ఇలా..

కరోనా అనుమానం.. అతని పాలిట శాపమై ప్రాణాలు తీసింది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చేసేందుకు కుట్రపన్నాడంటూ ఓ 22 ఏళ్ల వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడి.. హత్య చేశారు. మృతుడు బవానా నగరం సమీపంలోని హరేవాలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతనెల నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి వెళ్ళాడమే కాకుండా.. ఆ తర్వాత విషయం చెప్పకుండా కూరగాయలతో నిండిన ట్రక్కుతో వ్యాపారానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అజాద్బూర్‌ సబ్జీ మండి […]

కరోనా అనుమానమే పెను భూతమై.. చివరకు ఇలా..

Edited By:

Updated on: Apr 09, 2020 | 9:45 PM

కరోనా అనుమానం.. అతని పాలిట శాపమై ప్రాణాలు తీసింది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చేసేందుకు కుట్రపన్నాడంటూ ఓ 22 ఏళ్ల వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడి.. హత్య చేశారు. మృతుడు బవానా నగరం సమీపంలోని హరేవాలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతనెల నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి వెళ్ళాడమే కాకుండా.. ఆ తర్వాత విషయం చెప్పకుండా కూరగాయలతో నిండిన ట్రక్కుతో వ్యాపారానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అజాద్బూర్‌ సబ్జీ మండి దగ్గర స్థానిక జనం పట్టుకున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం వదిలేశారు. ఆ తర్వాత ఆ వక్తి తన సొంత గ్రామానికి చేరుకున్న సమయంలో.. అక్కడి స్థానికులు అతడిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించంగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us