CBSE పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలు/ జిల్లాలకు వెళ్లిన 10, 12వ తరగతి విద్యార్ధులు.. తాము ఉన్న చోటు నుంచే వాయిదా పడిన ఎగ్జామ్స్కు హాజరు కావచ్చునని కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.
సొంతూళ్లకు వెళ్లిన విద్యార్ధులు తమ చిరునామా వివరాలను పాఠశాలలకు తెలపాలని సూచించారు. దాని ఆధారంగా పాఠశాల యాజమాన్యం వారికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అటు విద్యార్థులు ఏ స్కూల్ నుంచి పరీక్షలు రాయాలన్న వివరాలను జూన్ మొదటి వారంలో వెల్లడిస్తామని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కాగా, ఇప్పటికే వాయిదాపడిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ను CBSE విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షలను జూలై 1 నుంచి జూలై 15 మధ్య నిర్వహించనున్నారు.
CBSE has decided that students who went back to their homes states/districts can inform their schools. They’ll be permitted to write exams in the dist where they currently are. In 1st week of June they’ll will be told that in what school they’ll be able to write exam:HRD Minister pic.twitter.com/7s3uG8QRk7
— ANI (@ANI) May 27, 2020
Read More:
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
ఇకపై వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్.. చేసుకోండిలా..
థాంక్యూ సీఎం గారు.. జగన్ను అభినందించిన మెగా బ్రదర్..
కరోనాను జయించిన హెచ్ఐవీ పేషంట్..
కిమ్ మరీ ఇంత క్రూరుడా.. పారిపోవాలని చూసిన వాళ్లని చిత్రహింసలు పెట్టి..