పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న బాలీవుడ్ రీమేక్ సినిమా ‘వకీల్ సాబ్’. నిజానికి ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా మరో వైపు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన నాని, సుధీర్ బాబు ‘వి’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సమ్మర్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల అది కుదరలేదు.
అందులోనూ ప్రస్తుతం కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. దీని బట్టి చూస్తుంటే ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ డెసిషన్ తీసుకున్నారట. ఒకవేళ జులై నెలలో అయినా థియేటర్స్ ఓపెన్ అయితే.. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముందుగా పవర్ స్టార్ మూవీ వకీల్ సాబ్ రిలీజయ్యే వరకూ ఏ సినిమాలు విడుదల చేయనని స్టేట్మెంట్ ఇచ్చేశారట.
Read More:
పీఎం కీలక నిర్ణయం.. వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం..
ఏపీ సర్కార్ సంచలనం.. అప్లై చేసిన పది పనిదినాల్లో పెన్షన్…