మార్కెట్లపై మారిటోరియం ఎఫెక్ట్

దేశీయ స్టాక్ మార్కెట్లు వీకెండ్‌లో నష్టాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ ఆర్ధిక ఏడాదిలోనూ వృద్ధి రేటు నెగిటివ్‌గానే నమోదయ్యే అవకశాలు ఉండటంతో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దీనికి తోడు టర్మ్ లోన్లపై మారిటోరియంను మరో మూడు నెలలపాటు పొడిగించటంతో బ్యాంకింగ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం కొద్దిపాటి లాభాల్లో మొదలైన సెన్సెక్స్… ఆర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి […]

మార్కెట్లపై మారిటోరియం ఎఫెక్ట్

Updated on: May 22, 2020 | 5:43 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వీకెండ్‌లో నష్టాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ ఆర్ధిక ఏడాదిలోనూ వృద్ధి రేటు నెగిటివ్‌గానే నమోదయ్యే అవకశాలు ఉండటంతో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. దీనికి తోడు టర్మ్ లోన్లపై మారిటోరియంను మరో మూడు నెలలపాటు పొడిగించటంతో బ్యాంకింగ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఈ ఉదయం కొద్దిపాటి లాభాల్లో మొదలైన సెన్సెక్స్… ఆర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి పడిపోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 30,672కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 9,039 వద్ద స్థిరపడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us