కరోనా.. ఢిల్లీ ఎయిమ్స్ లో సీనియర్ డాక్టర్ పాండే మృతి

| Edited By: Pardhasaradhi Peri

May 23, 2020 | 8:30 PM

కరోనా వైరస్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో పని చేసే సీనియర్ డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్ళు. పల్మనాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ కూడా అయిన డాక్టర్ పాండే మృతిని..

కరోనా.. ఢిల్లీ ఎయిమ్స్ లో సీనియర్ డాక్టర్ పాండే మృతి
Follow us on

కరోనా వైరస్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో పని చేసే సీనియర్ డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్ళు. పల్మనాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ కూడా అయిన డాక్టర్ పాండే మృతిని మరో సీనియర్ డాక్టర్ సంగీతా రెడ్డి ధృవీకరించారు. ఆయన మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, వైద్య వృత్తిలో ఆయన అపారమైన అనుభవం కలిగినవారని ఆమె ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఎయిమ్స్ క్యాంటీన్ లో పని చేసే ఓ మెస్ వర్కర్  కరోనా వైరస్ తో మృతి చెందిన మరునాడే పాండే కూడా కన్ను మూశారు. ఢిల్లీలో ఇప్పటికే కరోనా రోగులకు సేవలందిస్తున్న ఆసుపత్రుల్లోని పలువురు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కరోనాకు గురయ్యారు.