కరోనాను జయించిన సీనియర్ నటి, ఎంపీ సుమలత..
కొద్ది రోజుల క్రితం సుమలతకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయడంతో.. రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. అలాగే తనతో పాటు అందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని..
దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ కేసుల విషయంలో భారత్.. ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది. ఇప్పటికే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇక సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కాగా ఇటీవలే ఈ వైరస్ బారిన పడిన ప్రముఖ సీనియర్ నటి, ఎంపీ సుమలత అంబరీష్ కోలుకున్నారు.
కొద్ది రోజుల క్రితం సుమలతకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయడంతో.. రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. అలాగే తనతో పాటు అందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని పేర్కొన్నారు.
అయితే చికిత్స తీసుకుంటున్న సుమలతలో మెరుగైన లక్షణాలు కనిపించడంతో.. ఆమెకు మళ్లీ కోవిడ్ టెస్టులు చేశారు డాక్టర్లు. ఈ సారి ఆమెకు నెగిటివ్ వచ్చింది. సుమలతకు కరోనా నెగిటివ్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటి, నాయకురాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.