‘ఇది ఫలితమివ్వని లాక్ డౌన్’.. మోదీ ప్రభుత్వం పై రాహుల్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 2:04 PM

ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మోదీ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఎలా విఫలమైందో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదు గ్రాఫ్ లతో ట్వీట్ చేశారు. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్...

ఇది ఫలితమివ్వని లాక్ డౌన్.. మోదీ ప్రభుత్వం పై రాహుల్ ఫైర్
Follow us on

ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మోదీ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఎలా విఫలమైందో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదు గ్రాఫ్ లతో ట్వీట్ చేశారు. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాల్లో విధించిన లాక్ డౌన్ తో…. ‘ఇండియన్ లాక్ డౌన్ ‘ ని పోలుస్తూ.. వీటిలో వివరించారు. దేశంలో చాలాసార్లు ఈ ఆంక్షలను పొడిగిస్తూ వచ్చారని, కానీ ఒక్కసారిగా ఇటీవలి రోజుల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ వచ్చాయని ఆయన అన్నారు. యూరప్ దేశాల్లో రోజువారీ కేసులు తగ్గుతూ రాగా.. దీనికి విరుద్దంగా మన దేశంలో ఎలా పెరుగుతున్నాయో రాహుల్ పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని తను ఆ  నాడే ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గత ఫిబ్రవరి నెలారంభంలో ఇండియాలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుజరాత్ పర్యటనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పుడే.. ఈ ముప్పును మోదీ ప్రభుత్వం సీరియస్ గా పరిగణించడంలేదని హెచ్చరించానన్నారు. దేశంలో తాజాగా 2.26 లక్షల కేసులు నమోదై.. 6,300 మంది రోగులు మరణించారని, కరోనాకు తీవ్రంగా గురైన దేశాల్లో ఇండియా 7 వ స్థానాన్ని, మరణాల్లో 12 వ స్థానాన్ని వహించిందని వివరించారు. నిజానికి టెస్టింగులు మరిన్ని పెంచాలని, ప్రతి ఇంట్లో టెస్టులు తప్పనిసరి అని రాహుల్ గాంధీ గతంలోనే సూచించారు.