భారత్ లో రెండో దశలో కోవిడ్ -19 వ్యాక్సిన్

| Edited By:

Aug 25, 2020 | 3:36 PM

కరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, అతి ఎక్కువగా ఆశలు రేకిత్తిస్తోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో మంగళవారం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

భారత్ లో రెండో దశలో కోవిడ్ -19 వ్యాక్సిన్
Follow us on

కరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, అతి ఎక్కువగా ఆశలు రేకిత్తిస్తోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో మంగళవారం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై పూణెకు చెందిన సీరమ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రయోగాలు నిర్వహించనుంది.

కొవిషీల్డ్ భద్రత, దాని రోగ నిరోధక శక్తిని నిర్ణయించేందుకు పూణెలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆస్పత్రి ఈ పరీక్షలకు వేదికైంది. ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికి సీరమ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

 

కొవిడ్-19 వ్యాక్సిన్ ఫేస్-2, ఫేస్-3 హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం సంస్థ చేసిన అభ్యర్థనకు.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ నెల 2న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో, 18 ఏళ్లకు పైబడిన 1600 మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నట్లు సీరమ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి.