ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. ఆదివారం కేసులు నిల్.. అంతేకాదు..

| Edited By:

May 03, 2020 | 8:33 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కేరళలో మాత్రం నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు కేసులు ఓ రోజు పెరుగుతూ… మరో రోజు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. క్రమక్రమంగా కరోనా బారినుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి రోజుకు కొందరు డిశ్చార్జ్ అవుతుండటంతో కేరళ సర్కార్‌ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి శైలజ కరోనా కేసులకు సంబంధించిన బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం నాడు […]

ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. ఆదివారం కేసులు నిల్.. అంతేకాదు..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కేరళలో మాత్రం నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు కేసులు ఓ రోజు పెరుగుతూ… మరో రోజు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. క్రమక్రమంగా కరోనా బారినుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి రోజుకు కొందరు డిశ్చార్జ్ అవుతుండటంతో కేరళ సర్కార్‌ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి శైలజ కరోనా కేసులకు సంబంధించిన బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం నాడు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేరళలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 95 అని తెలిపారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది.

కాగా.. ఆదివారం కేరళలో కొత్తగా మరో నాలుగు ప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య 84కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 21,720 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారని తెలపగా.. వీరిలో 388 మంది ఆసుపత్రుల్లో ఉన్నారని.. మిగతా వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.