దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. నాలుగో విడత లాక్డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు దేశంలోపలే ప్రయాణించిన వారిని సైతం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపింది. మే 26 నాటికి మొత్తంగా 22 లక్షల 81 వేలమందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు వివరించింది.
మే 14 నాటికి 11లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా, 12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు కేంద్రం పేర్కొంది. మే 26 నాటికి మహారాష్ట్రలో 6 లక్షల 2 వేల మంది, గుజరాత్లో 4 లక్షల 42 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 3 లక్షల 6 వేల మంది, బీహార్లో 2.1 లక్షల మంది, ఛత్తీస్గఢ్లో 1.86 లక్షలు, ఆంధ్రపదేశ్లో 14 వేల 930 మంది క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి తమ రాష్ట్రాల్లోకి వచ్చేవారిని కనీసం ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్నాయి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇదివరకు 14 రోజులుగా ఉన్న క్వారంటైన్ కాలాన్ని ఇప్పుడు 7 రోజులకు కుదించారు.