ముంబై….మురికివాడల్లోనే కోవిడ్ 57 శాతం…..సర్వేలో వెల్లడి

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2020 | 10:21 AM

ముంబైలోని మురికివాడల్లో 57 శాతం మంది, ఇతర ప్రాంతాల్లో 16 శాతం మంది కోవిడ్-19 కి గురైనట్టు ఓ సర్వేలో తేలింది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఏడు వేల మందిని సీరోలాజికల్ సర్వే చేయగా.. లక్షలాది ప్రజలు గుంపులుగా..

ముంబై....మురికివాడల్లోనే కోవిడ్ 57 శాతం.....సర్వేలో వెల్లడి
Follow us on

ముంబైలోని మురికివాడల్లో 57 శాతం మంది, ఇతర ప్రాంతాల్లో 16 శాతం మంది కోవిడ్-19 కి గురైనట్టు ఓ సర్వేలో తేలింది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఏడు వేల మందిని సీరోలాజికల్ సర్వే చేయగా.. లక్షలాది ప్రజలు గుంపులుగా ఉండే స్లమ్స్ లోనే కరోనావైరస్ ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఏ వ్యాధినైనా ఎదుర్కొనే యాంటీ-బాడీలు వీరిలోనా..లేక ఇతర ప్రాంతాలవారిలో ఎక్కువగా ఉన్నాయాఅన్న అంశాన్ని డాక్టర్లు కనుగొన్నారు. కోటీ 20 లక్షలకు పైగా జనాభా గల ఈ నగరంలో 65 శాతం మంది మురికివాడవాసులే! నీతి ఆయోగ్నగర మున్సిపల్ కార్పొరేషన్, టాటా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. పురుషులకన్నా మహిళల్లోనే యాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం ఈ అధ్యయనంలో తేలింది.

ముంబైలో కరోనా వైరస్ కేసులు లక్షకు పైగా దాటిపోయాయి. అయితే ధారావి వంటి మురికివాడల్లో ఈ వైరస్ ప్రబలంగా ఉండడం సాధారణ విషయమేనని నిపుణులు పేర్కొంటున్నారు. శుభ్రతను  పాటించడంలో వీరు ఇతర ప్రాంతాలవారికన్నాఎక్కువగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా వెల్లడైంది.