శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు

|

Jun 27, 2020 | 10:06 AM

ప్రస్తుతం దేవస్థానంలో పని చేస్తున్న సిస్టమ్ అడ్మిన్లను వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు వివిధ విభాగాలకు ఆకస్మికంగా వెళ్తుండటం పలువురికి భయాందోళనలను కలిగిస్తున్నది....

శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు
Follow us on

శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయి నుంచి కూపీ లాగుతున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి ఏసీబీ జేడీ గంగాధర్ రావు  ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది. విరాళాల కేంద్రంలోని పలు కీలక పేపర్లను స్వాధీనం చేసుకుంది. అనినీతికి పాల్పడినవారితోపాటు.. వారికి సహకరించినవారిని కూడా ప్రత్యేకంగా విచారించింది.

టీఎంఎస్ సర్వీసెస్ వారిని కూడా విచారించనున్నట్లు తెలిసింది. అవినీతి కుంభకోణంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరికొందరు అధికారుల పేర్లు కూడా ఈ సందర్భంలో చర్చకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొండపై ఉన్న వివిధ విభాగాలను వారు పరిశీలించారు. శ్రీశైలంలోని టోల్గేట్, అన్నదాన విరాళకేంద్రం, పెట్రోల్ బంక్, అకామిడేషన్ విభాగంలోని ముఖ్యమైన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.