కరోనా అంతం కోసం యాగం నిర్వహించిన బీజేపీ

| Edited By:

Jul 17, 2020 | 5:24 AM

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రార్థిస్తూ.. హిమాచల్ ప్రదేశ్‌లో యాగం నిర్వహించారు. స్థానిక బీజేపీ వుమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో 55 లక్షల గాయత్రి మంత్ర జపం నిర్వహించారు. అనంతరం..

కరోనా అంతం కోసం యాగం నిర్వహించిన బీజేపీ
Follow us on

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రార్థిస్తూ.. హిమాచల్ ప్రదేశ్‌లో యాగం నిర్వహించారు. స్థానిక బీజేపీ వుమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో 55 లక్షల గాయత్రి మంత్ర జపం నిర్వహించారు. అనంతరం గురువారం నాడు షిమ్లాలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం జైరాం ఠాకూర్ హాజరయ్యారు. కరోనా మహమ్మారి అంతం కావాలని.. ప్రపంచానికి శాంతి చేకూరాలని కోరుతూ ఈ మంత్ర జపం నిర్వహించామని బీజేపీ వుమెన్స్ వింగ్ పేర్కొంది. ఇక ఈ పూర్ణాహుతికి హాజరైన సీఎం కూడా స్పందించారు. ఇలాంటి వైరస్ మహమ్మారులకు వ్యాక్సిన్ లేనప్పుడు.. మెడిసిన్ ద్వారా మాత్రమే వైద్యం అందుతుందని.. అదే సమయంలో ఇలాంటి మంత్ర జపం చేయడంద్వారా ఎంతో శక్తిని ఇస్తుందని అన్నారు.