అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి అంటే ?

| Edited By: Pardhasaradhi Peri

May 23, 2020 | 4:41 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు అదుపులోకి వఛ్చిన పక్షంలో జూన్ రెండో వారం (మధ్యకాలం) నుంచి గానీ, జులై నుంచి గానీ  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావచ్ఛునని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన విమానాలను పునరుధ్ధరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆన్ లైన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ ఆయన.. అన్నీ అనుకూలించిన పక్షంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి […]

అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి అంటే ?
Follow us on

దేశంలో కరోనా వైరస్ కేసులు అదుపులోకి వఛ్చిన పక్షంలో జూన్ రెండో వారం (మధ్యకాలం) నుంచి గానీ, జులై నుంచి గానీ  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావచ్ఛునని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన విమానాలను పునరుధ్ధరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆన్ లైన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ ఆయన.. అన్నీ అనుకూలించిన పక్షంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి జులై లేదా ఆగస్టు వరకు ఎందుకు వేచి ఉండాలని ప్రశ్నించారు. ఈ వైరస్ తో మనం ‘సహజీవనానికి’ అలవాటు పడితే.. మనం అనుకున్నట్టు ఈ కేసులు కంట్రోల్ అయిన పక్షంలో .. ఇక విమానాల పునరుధ్ధరణ ఏర్పాట్లకు సిధ్ధంగా ఉన్నాం అని ఆయన చెప్పారు.

కాగా-సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్జరిస్తున్నట్టు హర్ దీప్ సింగ్ పురి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదన్న ఆయన వ్యాఖ్యలపై కేరళ, అస్సాం, కర్ణాటక సహా అప్పుడే కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలను ప్రకటించాయి. ఆయా రాష్టాల నుంచి వచ్ఛే విమాన ప్రయాణికులు ఏడు రోజులు ప్రభుత్వ క్వారంటైన్ లోను, మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లోను ఉండాలని కర్ణాటక ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఇక తమిళనాడు రాష్ట్రమైతే.. విమాన సర్వీసుల పునరుధ్ధరణపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరింది.