తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

| Edited By: Pardhasaradhi Peri

Apr 28, 2020 | 4:35 PM

ఇన్‌స్టా లైవ్‌లో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన 'భీష్మ' గురించి కూడా టాపిక్ రావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు..

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ
Follow us on

ఇన్‌స్టా లైవ్‌లో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన ‘భీష్మ’ గురించి కూడా టాపిక్ రావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు.. స్నేహితుల్ని, సహచరుల్ని చాలా మిస్ అవుతున్నారు. దీంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా వారి మాటల్లో తెలుగు సినిమా ‘భీష్మ’ టాపిక్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ట్వీట్ చేశారు.

వీడియోలో.. ఏం సినిమా చూస్తున్నావని హనుమ విహారిని అడిగాడు అశ్విన్. ఇటీవలే భీష్మ చూశానని, ఫుల్ కామెడీగా ఉందని పేర్కొన్నాడు. హీరో ఎవరని అశ్విన్ అడగ్గా, నితిన్ అని హునుమ చెప్పాడు. దీనికి అశ్విన్.. తమ ఇంట్లో అందరూ పాత సినిమాలే చూస్తున్నారని, నేను తెలుగు సినిమాలకు పెద్ద అభిమానినని తెలిపాడు.

తన సినిమా గురించి భారత క్రికెటర్లు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు డైరెక్టర్ వెంకీ కుడుముల. భీష్మను ఇష్టపడుతున్నందుకు హనుమ విహారికి, తెలుగు సినిమాలని ప్రేమిస్తున్నందుకు అశ్విన్‌కి కృతజ్ఞతలు చెప్పారు.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్