Coronavirus India: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

|

Aug 14, 2021 | 9:49 AM

Covid-19 Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ.. కొన్ని రోజుల

Coronavirus India: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?
India Corona Updates
Follow us on

Covid-19 Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. శుక్రవారం కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 478 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు పెరిగింది.

తాజాగా ఈ మహమ్మారి నుంచి 35,743 మంది బాధితులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం కోలుకున్న వారిసంఖ్య 3,13,38,088 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కాగా గురువారం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితోపోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.45 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 1.21 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 22,29798 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also Read:

Delta Plus variant: మహారాష్ట్రలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్.. ఐదుగురు మృతి.. కేసులు ఎన్నంటే..?

KTR Cricket: టెస్ట్‌ క్రికెట్‌లో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది.. ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్‌.