భారత్ మానవతా దృక్పథం…… ఉత్తర కొరియాకు భారీ వైద్య సాయం..

నార్త్ కొరియాకు ఇండియా భారీ వైద్య సాయం అందజేసింది. సుమారు 10 లక్షల డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని మానవతా దృక్పథంతో..

భారత్ మానవతా దృక్పథం...... ఉత్తర కొరియాకు భారీ వైద్య సాయం..

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 25, 2020 | 2:19 PM

నార్త్ కొరియాకు ఇండియా భారీ వైద్య సాయం అందజేసింది. సుమారు 10 లక్షల డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని మానవతా దృక్పథంతో ఈ సాయం చేసినట్టు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ నాటి నుంచో కొరియా దేశాలకు యాంటీ ట్యూబర్ కొలోసిస్ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ  మందులను ఉత్తర కొరియా లోని భారత రాయబారి అతుల్ మల్హరి  అక్కడి ప్రభుత్వానికి అందజేశారు.

ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కేసులు లేనప్పటికీ..ముఖాలకు మాస్కులు ధరించనివారు తప్పనిసరిగా మూడు నెలలపాటు లేబర్ పనులు చేయాలని ఆ ప్రభుత్వం శిక్షగా విధించింది.  విద్యార్థుల బృందాలు వీధుల్లో నిఘా టీములుగా తిరుగుతూ.. మాస్కులు ధరించనివారి పని పడుతున్నారట.