హాట్ స్పాట్స్– ఎపిలో 7 జిల్లాలు, తెలంగాణాలో 3 జిల్లాలు…
అనేక ప్రాంతాలను హాట్స్పాట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. అందులో ఏపీ నుంచి ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను హాట్స్పాట్ కేంద్రాలు గా ప్రకటించింది...
దేశంలో కరోనా వైరస్ మహ్మమారి మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. కేంద్రం విధించిన లాక్డౌన్ అమల్లో ఉంది. ఢిల్లీ ప్రార్థనల ఎఫెక్ట్తో దేశంలో చాలా చోట్ల కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలను హాట్స్పాట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. అందులో ఏపీ నుంచి ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను హాట్స్పాట్ కేంద్రాలు గా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలున్నాయి. హాట్స్పాట్ పరిధిలో ఉన్న జిల్లాల్లో గుర్తించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఆయా జిల్లాలో అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన రెడీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పరిస్థితికి అనుగుణంగా మొత్తం ప్రాంతాలను సెల్ఫ్ క్వారంటైన్ గా మార్చాలని, ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా చూడాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది.