Coronavirus: కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం

|

Jul 23, 2021 | 2:52 PM

కరోనా బాధిత భర్త వీర్యం కోసం గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఇంట విషాదం నెలకుంది. కోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన....

Coronavirus: కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం
Covid Patient Dies
Follow us on

కరోనా బాధిత భర్త వీర్యం కోసం గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఇంట విషాదం నెలకుంది. కోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన ఒక్కరోజు తర్వాత.. ఆమె భర్త తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సదరు మహిళ తరఫు న్యాయవాది నీలాయ్​ పటేల్ శుక్రవారం వెల్లడించారు ఈ కేసుపై తదుపరి విచారణకు కొద్ది గంటల ముందే ఈ ఘటన జరిగింది.

కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి…

వడోదరాలోని స్టెర్లింగ్​ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న తన భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్​ విధానంలో తల్లి కావాలని ఓ మహిళ కోరుకుంది. అయితే.. అందుకు డాక్టర్లు నో చెప్పారు. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే తాము వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దీంతో గుజరాత్ హైకోర్టులో ఆ మహిళ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. సదరు కరోనా​ బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా స్టోర్ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశించిన తర్వాత మంగళవారమే ఆ వ్యక్తి వీర్యాన్ని డాక్టర్లు సేకరించారని స్టెర్లింగ్​ ఆస్పత్రి జోనల్ డైరెక్టర్​ అనిల్​ నంబియార్​ బుధవారం తెలిపారు. కోర్టు అనుమతి ఇస్తే.. ఐవీఎఫ్ విధానం కోసం దాన్ని వినియోగిస్తామని వెల్లడించారు. కాగా ఎమర్జెన్సీ వార్డులో కరోనాతో చికిత్స పొందుతున్న భర్త నుంచి వీర్యం కోసం సదరు మహిళ కోర్టుకు వెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read:గుడిలో కుడికాలు పెట్టలేదని నవవధువు చెంప చెళ్ళుమనిపించిన ఆడపడుచు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

తమిళనాడులో హృదయవిదాకర ఘటన.. ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు కూతుళ్లు.. తల్లిని కొట్టి చంపి, ఆ రక్తంలోనే ఆటలు..!