కరోనా నుంచి కోలుకున్న ఏపీ డిప్యూటీ సీఎం దంపతులు

|

Jul 17, 2020 | 11:17 AM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా..ఆయన భార్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తనకు కరోనా సోకడంపై స్పందించారు.

కరోనా నుంచి కోలుకున్న ఏపీ డిప్యూటీ సీఎం దంపతులు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా..ఆయన భార్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తనకు కరోనా సోకడంపై స్పందించారు. తాను, తన భార్య కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో తాము ఆస్పత్రి డిశ్చార్జ్‌ అవుతామని చెప్పారు.

అయితే..కరోనా లక్షణాలతో తాము తొలుత హోం ఐసోలేషన్‌లో ఉన్నామని చెప్పారు. కలెక్టర్‌, వైద్యాధికారుల సూచనలతో తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో అందించిన మెరుగైన చికిత్సతో తాము కరోనా నుంచి కోలుకున్నామని అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.