AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైపింగ్ పొరపాట్లను కూడా ఎత్తి చూపుతున్నారు: ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవేదన

కరోనా నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తుంటే..  కొందరు కావాలనే తమపై బురద జల్లుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యులు, సిబ్బందిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం  బాధాకరమని.. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రజలు సహకరిస్తున్నారని ఆ శాఖ వెల్లడించింది. చిన్న చిన్న టైపింగ్‌ పొరపాట్లను ఎత్తి చూపి మాపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైద్య శాఖ ఇచ్చే సమాచారంపై ఎవ్వరికీ సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించొచ్చు.  […]

టైపింగ్ పొరపాట్లను కూడా ఎత్తి చూపుతున్నారు: ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవేదన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 10:17 PM

Share

కరోనా నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తుంటే..  కొందరు కావాలనే తమపై బురద జల్లుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యులు, సిబ్బందిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం  బాధాకరమని.. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రజలు సహకరిస్తున్నారని ఆ శాఖ వెల్లడించింది.

చిన్న చిన్న టైపింగ్‌ పొరపాట్లను ఎత్తి చూపి మాపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైద్య శాఖ ఇచ్చే సమాచారంపై ఎవ్వరికీ సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించొచ్చు.  కరోనా వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తి పారదర్శకంగానే నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రంలో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేదు.. కానీ ఇప్పుడు రోజుకి 2300 పరీక్షల సామర్థ్యం గల వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేశాం. అలాగే ఇప్పటి వరకు 21450 మందికి కరోనా పరీక్షలు జరిపాం. అంతేకాదు రోజుకి 17, 500 టెస్టులు చేసే సామర్థ్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందుకోసం వైరల్‌ ల్యాబ్‌లతో పాటు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను సమకూర్చుకున్నాం. లక్ష ర్యాపిడ్ కిట్లు, 50 వేల టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చాము’’ అని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read This Story Also: లాక్‌డౌన్‌ ఉల్లంఘించి.. ప్రముఖ యూనివర్సిటీ పైత్యం.. షోకాజ్ నోటీసులు..!