కరోనా.. ట్రయల్స్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేతులు కలుపుతాం.. ఇండియా

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 3:08 PM

కరోనా వ్యాధి చికిత్సకు మందును కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపే ట్రయల్స్ లో పాలుపంచుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఇలాంటి ట్రయల్స్ కు భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ విధమైన ప్రయోగాలకు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టినప్పుడు తాము కూడా వాటిలో పాల్గొంటామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ లోని అంటువ్యాధుల నివారణ విభాగం హెడ్ డాక్టర్ గంగాఖేద్కర్ తెలిపారు. దీన్ని సాలిడారిటీ ట్రయల్ గా వ్యవహరిస్తున్నామన్నారు. ‘లొపినవిర్’, ‘రైటోనవిర్’ […]

కరోనా.. ట్రయల్స్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేతులు కలుపుతాం.. ఇండియా
Follow us on

కరోనా వ్యాధి చికిత్సకు మందును కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపే ట్రయల్స్ లో పాలుపంచుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఇలాంటి ట్రయల్స్ కు భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ విధమైన ప్రయోగాలకు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టినప్పుడు తాము కూడా వాటిలో పాల్గొంటామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ లోని అంటువ్యాధుల నివారణ విభాగం హెడ్ డాక్టర్ గంగాఖేద్కర్ తెలిపారు. దీన్ని సాలిడారిటీ ట్రయల్ గా వ్యవహరిస్తున్నామన్నారు. ‘లొపినవిర్’, ‘రైటోనవిర్’ అనే మందుల మిశ్రమంతో కూడిన’రెమ్ డెసివర్’ , ఇంటర్ఫెరాన్ బెటా, క్లోరోక్విన్ కాంబినేషన్ మందులతో ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని, ప్రస్తుతం అనేక ఆసుపత్రుల్లో రెమ్ డెసివర్ మెడిసిన్ ని ఎక్కువగా వాడుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు ముఖ్యమైనది…  ఏ డ్రగ్, లేదా ఏ వ్యాక్సీన్ పని చేస్తుందో అన్న విషయాన్ని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం.. ట్రయల్స్ సందర్భంగా ఈ మందుల అంశాన్ని కూడా చేర్చాలా అన్నదే ప్రధానం అని గంగాఖేద్కర్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 30 వ్యాక్సీన్ గ్రూపులను వైద్యులు అధ్యయనం చేస్తున్నారని, వీటిలో 5 ఎనిమల్ టాక్సిసిటీ స్టడీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రయోగాత్మకంగా జంతువులపై ప్రయోగించే దశలో ఉన్నాయన్నారు. భారత జనాభాకు అనువైన మందులను కనుగొనే క్రమంలో సరైన సమయంకోసం వేచిచూస్తున్నామని ఆ డాక్టర్ వివరించారు.