ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్ తాజాగా అత్యవసర సేవలకు వినియోగించే 108సర్వీస్ వాహనాలను మరింత పెంచారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా అధికారుల నుంచి రాష్ట్రంలో పూర్తి సమాచారంపై చర్చించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ..108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అలాగే టెలి మెడిసిన్ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.