పునరుద్ధరించిన విమానాల్లో ప్రయాణికుల సందడి

| Edited By: Pardhasaradhi Peri

May 26, 2020 | 7:59 PM

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం మొదటిసారిగా ఈ నెల 25 న దేశీయ విమానాలు ఎగిరాయి. ఈ సర్వీసులను పునరుధ్దరించిన తొలి రోజున మొత్తం 58,318 మంది విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు.

పునరుద్ధరించిన విమానాల్లో ప్రయాణికుల సందడి
Follow us on

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం మొదటిసారిగా ఈ నెల 25 న దేశీయ విమానాలు ఎగిరాయి. ఈ సర్వీసులను పునరుధ్దరించిన తొలి రోజున మొత్తం 58,318 మంది విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. నిన్న మొత్తం 832 విమానాలను నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. ఏపీలో మంగళవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు. కాగా నిన్న మొత్తం 630 విమానాలను రద్దు చేశారు. పశ్చిమ బెంగాల్, ఏపీ తమ రాష్ట్రాల్లో విమాన సర్వీసుల నిర్వహణకు మొదట విముఖత చేసినప్పటికీ ఏపీ ఆ తరువాత ఈ నెల 26 నుంచి ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పురి వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమాన ప్రయాణికులకు సీఎం మమత ప్రభుత్వం  గైడ్ లైన్స్ జారీ చేసింది. . ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రయాణికులు అన్ని కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.