వినియోగదారులకు జియో గుడ్ న్యూస్.. ఉచితంగా టాక్టైం..
Coronavirus Outbreak: దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు రీచార్జ్ లు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్టైం, 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. అటు రీచార్జ్ చేయకున్నా లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు లాక్ డౌన్ నుంచి టెలికాం సంస్థలకు మినహాయింపు ఇచ్చిన […]
Coronavirus Outbreak: దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు రీచార్జ్ లు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్టైం, 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. అటు రీచార్జ్ చేయకున్నా లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు లాక్ డౌన్ నుంచి టెలికాం సంస్థలకు మినహాయింపు ఇచ్చిన చాలా చోట్ల దుకాణాలు తెరిచి లేవని.. వినియోగదారులు అందరూ కూడా ఆన్లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాన్స్ గడువును పెంచాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను కోరింది.
అటు ట్రాయ్ సూచన మేరకు ఎయిర్ టెల్ కాలపరిమితిని ఏప్రిల్ 17 వరకు పొడిగించడమే కాకుండా.. పది రూపాయల టాక్ టైంను కూడా జత చేసింది. ఇక వొడాఫోన్ ఐడియా కూడా ఇదే ఆఫర్ ను ప్రకటించగా.. ఇది కేవలం పేదలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇవి చదవండి:
మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..