తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి..
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యలు, రాత్రి కర్ఫ్యూ కారణంగా వైరస్ వ్యాప్తి కంట్రోట్లోకి వస్తోంది. తాజాగా ఏడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో వార్త తెలంగాణవాసులకు ఊరటనిస్తోంది. కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలో కరోనా వచ్చిన 8 మందికి చికిత్స చేసిన అనంతరం పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘అందరూ […]
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యలు, రాత్రి కర్ఫ్యూ కారణంగా వైరస్ వ్యాప్తి కంట్రోట్లోకి వస్తోంది. తాజాగా ఏడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో వార్త తెలంగాణవాసులకు ఊరటనిస్తోంది.
కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలో కరోనా వచ్చిన 8 మందికి చికిత్స చేసిన అనంతరం పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే సంగారెడ్డి కరోనా ఫ్రీ జిల్లాగా మారిందన్నారు. అటు పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేసేది మన రక్షణ కోసమేనని హరీష్ రావు అన్నారు. ఇక కరోనా కారణంగా రాష్ట్రంలో ఆదాయం తగ్గినా.. సంక్షేమం విషయంలో ప్రభుత్వం అసలు వెనక్కి తగ్గదని ఆయన తెలిపారు. కాగా, సుమారు 74 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి 1500 రూపాయలు పడ్డాయని హరీష్ రావు వెల్లడించారు.
ఇవి చదవండి:
మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్ల అల్టిమేటం..
పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!
షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!
కరోనాకు సిగరెట్తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!
విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..
ఆర్సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ
అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..