కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్‌ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పీసీసీ రేసులో అందరికంటే తానే ముందున్నానన్నారు. ఇక త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీపీసీసీ పదవి నుంచి వైదొలగనున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర […]

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..
Follow us

| Edited By:

Updated on: Nov 22, 2019 | 8:53 PM

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్‌ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పీసీసీ రేసులో అందరికంటే తానే ముందున్నానన్నారు. ఇక త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీపీసీసీ పదవి నుంచి వైదొలగనున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నానని.. ఇందుకోసం అధిష్టానం అనుమతి కూడా కోరానన్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు.

ఇక ఇదిలా ఉంటే.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇటీవల తన మనసులో ఉన్న మాటను తెలిపారు. తాను కూడా టీపీసీసీ రేసులో ఉన్నానన్నారు. తనకు టీపీసీసీగా అవకాశమిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు.. ప్రజా క్షేత్రంలో సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జగ్గారెడ్డితో పాటు.. మరికొందరు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది.

కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం కూడా వెంకట్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రాదంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తమకు పీసీసీ పగ్గాలు ఇస్తే.. పార్టీ సజీవంగా బతకడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగానే.. బీజేపీకే భవిష్యత్తు ఉందని.. త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకుని.. కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆడిన ఈ గేమ్ అంతా అన్నకు పీసీసీ పదవి కోసమేనేమో అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు