ఆలయాలపై సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న జగన్..!
ఏపీలోని ఆలయాలు, ట్రస్టుల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ఇక అగ్ర ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రేవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అదే విధంగా మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించేలా ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణను కూడా […]
ఏపీలోని ఆలయాలు, ట్రస్టుల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ఇక అగ్ర ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రేవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అదే విధంగా మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించేలా ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణను కూడా అసెంబ్లీ ఆమోదించింది.
ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా వారిని పదవీకాలం కంటే ముందే తొలగించేలా ఈ బిల్లు రూపొందించారు. ఆలయాల పరిరక్షణ, పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారముంటుంది.
ఆలయాల పాలక మండళ్లలో సామాజిక న్యాయం చేసేందుకే ఈ బిల్లును తీసుకువచ్చినట్టు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ బిల్లు ద్వారా సభ్యుడు ఎవరైనా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, అవినీతికి పాల్పడినా వారిని తొలగించే అవకాశముంటుందని వైసీపీ సభ్యుడు మల్లాది విష్ణు అన్నారు.