
న్యూఢిల్లీ, జనవరి 26: కేంద్రం సివిల్ సర్వీసెస్ క్యాడర్ కేటాయింపులో సవరణలు చేసింది. అఖిల భారత సర్వీసుల క్యాడర్ కేటాయింపులకోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఇప్పటి వరకు అనుసరిస్తున్న జోనల్ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలను అక్షర క్రమంలో 4 గ్రూపులుగా విభజించింది. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఈ గ్రూపులవారీగా క్యాడర్కు కేటాయించనున్నారు. దీంతో 2017 నుంచి అమలులో ఉన్న జోనల్ విధానం స్థానంలో కొత్త గ్రూపు విధానం అమల్లోకి తెచ్చింది. ఇవి గతంలో మొత్తం 5 జోన్లుగా ఉండేవి. తాజా వీటిని సవరించి 4 జోన్లుగా కుదించారు. అవేంటంటే..
ఈ మేరకు 4 జోన్లను అక్షర క్రమంలో చేర్చారు. క్యాడర్ కేటాయింపుల్లో నిష్పాక్షికమైన, పారదర్శకతను పాటించడంకోసం అన్ని రాష్ట్రాల క్యాడర్, జాయింట్ క్యాడర్లను ఈ మేరకు విభజించినట్లు కేంద్రం వెల్లడించింది. అభ్యర్థుల ప్రాధాన్యం, ర్యాంకు, కేటగిరీ, ఆయారాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా సాధారణంగా క్యాడర్ కేటాయింపు చేస్తారు. ఇదివరకు రాష్ట్రాలను ప్రాంతాలవారీగా జోన్లుగా విభజించేవారు. ఇప్పుడు ఆ విధానం స్థానంలో అక్షరక్రమంలో గ్రూపింగ్ చేసి కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.