
హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్పూర్ 2027 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు JAM Online Application Processing System (JOAPS) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు అక్టోబర్ 12, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. JAM 2027 స్కోర్ ద్వారా దేశంలోని ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో వివిధ MSc, ఇంటిగ్రేటెడ్ MSc-PhD తదితర పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. 2027-28 విద్యా సంవత్సరానికి 23 ఐఐటీల్లో దాదాపు 3,000 పోస్ట్గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. JAM 2027 పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14, 2027న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు గరిష్టంగా రెండు టెస్ట్ పేపర్లకు హాజరుకావచ్చు. అయితే ఆ రెండు పేపర్లు వేర్వేరు పరీక్షా సెషన్లలో ఉండాలి.
JAM 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
JAM 2027కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
JAM 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.