
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు ప్రకగనత విడుదల చేసింది. ఈ ఏడాది ఐసెట్ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఐసెట్ ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మార్చి 2, 2026వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఏపీ ఐసెట్)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎంసీఏకు మాత్రం ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశాలకు ఆన్లైన్లో మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.750, బీసీ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.650 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక మే 2న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.