Delhi: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో 15 వేలకిపైగా ఖాళీలు.. లోక్‌ సభలో కేంద్ర విద్యాశాఖ వెల్లడి..

|

Jul 26, 2022 | 7:05 AM

Delhi: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తం 15 వేలకిపైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి...

Delhi: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో 15 వేలకిపైగా ఖాళీలు.. లోక్‌ సభలో కేంద్ర విద్యాశాఖ వెల్లడి..
Follow us on

Delhi: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తం 15 వేలకిపైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవీ ఈ వివరాలను వెల్లడించారు. 2021 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 12 వేలకిపైగా, నవోదయ విద్యాలయాల్లో 3 వేలకు పైగా టీచింగ్ పోస్టులు ఉన్నాయని మంత్రి వివరించారు.

కేంద్రీయ విద్యాలయాల్లో 9 వేల మందికి పైగా టీచర్లు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12,044 టీచింగ్‌ పోస్టులు, 1,332 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో తమిళనాడులో 1,162, మధ్యప్రదేశ్‌లో 1,066, కర్ణాటకలో 1,066 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే నవోదయ విద్యాలయాల్లో మొత్తం 3156 ఖాళీల్లో జార్ఖండ్‌లో అత్యధికంగా 230 ఉన్నాయని మంత్రి వివరించారు. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తామని, భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..