కాంగ్రెస్, బీజేపీలు ‘పోషించిన’ ఆ పత్రిక యజమాని అరెస్ట్

వివాదాస్పద బిజినెస్ మన్, మధ్యప్రదేశ్ లో ఓ చిరు వార్తాపత్రిక (టాబ్లాయిడ్) యజమాని కూడా అయిన జీతూ సోని.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతగాడు

కాంగ్రెస్, బీజేపీలు 'పోషించిన' ఆ పత్రిక యజమాని అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 10:50 AM

వివాదాస్పద బిజినెస్ మన్, మధ్యప్రదేశ్ లో ఓ చిరు వార్తాపత్రిక (టాబ్లాయిడ్) యజమాని కూడా అయిన జీతూ సోని.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతగాడు గత 7 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. రేప్, మనుషుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, భూకబ్జా, బ్లాక్ మెయిలింగ్ వంటి అనేక నేరాలతో ప్రమేయమున్న జీతూ సోనిని పట్టి ఇఛ్చినవారికి ప్రభుత్వం 1.6 లక్షల రివార్డు ప్రకటించింది. గుజరాత్ లోని ఇతని స్వస్థలమైన అమ్రేలి జిల్లాలో ఇతడిని అరెస్టు చేశారు. ఇతని క్రిమినల్ హిస్టరీ చాలానే ఉంది. ఒకప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రాజకీయ ప్రాపు సంపాదించిన ఇతనికి ఉన్నత పోలీసు అధికారుల తోనూ లింకులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు ఇదివరలో సీఎం గా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ (ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా)..సీనియర్ అడ్వైజర్ల సెక్స్ స్కాండల్ తాలూకు వార్తలను ఇతని ప్రత్రిక గత సెప్టెంబరులో ప్రచురించడంతో  రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం రేగింది. లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాన్స్ బార్, హోటల్, రెస్టారెంట్ వంటి ఇతని ఆస్తులపై పోలీసులు దాడులు చేశారు. ఇతని ఆధ్వర్యంలో నడిచిన సెక్స్ రాకెట్ కి సంబంధించి పోలీసులు అయిదుగురు మహిళలను, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సెక్స్ టేపుల ద్వారా అనేకమంది బ్యూరోక్రాట్లను, పొలిటిషియన్లను బ్లాక్  మెయిల్ చేసినట్టు వెల్లడైంది. జీతూ సోని నివాసం నుంచి మొబైల్ ఫోన్లను, ఆడియో రికార్డింగులను, ల్యాప్ టాప్ నుచి నాలుగు వేల ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.