
Gold Price Today: బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. తాజాగా మార్చి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు పుంచుకున్నాయి. ఇటీవల నుంచి బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వచ్చాయ. రికార్డు స్థాయిలో తగ్గుతూ అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక వైపు యుద్దం కొనసాగుతుంటే మరో వైపు బంగారం ధరలు దిగి రావడం మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నాయనే చెప్పాలి. కానీ రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు
| నగరం | 22 క్యారెట్లు | 24 క్యారెట్లు ) |
| హైదరాబాద్ | రూ. 1,32,660 | రూ. 1,44,720 |
| విజయవాడ | రూ 1,32,660 | రూ. 1,44,720 |
| ఢిల్లీ | రూ. 1,32,810 | రూ.1,44,870 |
| ముంబై | రూ. 1,32,660 | రూ. 1,44,720 |
నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.160 వరకు పెరుగుదల కనిపించింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్కుకు సుమారు $ 4,430 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ. 2,39,900 వద్ద కొనసాగుతోంది.
అదే హైదరాబాద్; కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుంది.
1. భౌగోళిక ఉద్రిక్తతలు: పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు.
2. డాలర్ హెచ్చుతగ్గులు: అమెరికా డాలర్ విలువలో మార్పులు కూడా స్థానిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
గమనిక: పైన పేర్కొన్న ధరలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటిపై జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు (Taxes, Making charges) అదనంగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందు మీ దగ్గర్లోని జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి