
సాధారణంగా ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లు లిథియం – అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. ఈ బ్యాటరీలు చాలా చిన్న స్థలంలో శక్తిని నిల్వ చేస్తాయి. దాని ద్వారా వాహనం పరుగులు తీస్తుంది. అయితేే వేడెక్కడం, బ్యాటరీలో నష్టం, పేలవమైన వైరింగ్ కారణంగా థర్మల్ రన్అవే అనే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు బ్యాటరీల నుంచి మంటలు వస్తాయి. చౌకయిన, నియంత్రణ లేని, తప్పుగా అసెంబుల్ చేసిన వాహనాల్లోనే ఈ సమస్య ఏర్పడుతుంది. అలాంటి వాటి నుంచే మంటలు వస్తాయి. విశ్వసనీమైన బ్రాండ్ల నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆ వాహనాల్లో బ్యాటరీని సురక్షితంగా ఉంచే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఈ కింద తెలిపిన అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (బీఎంఎస్) ముఖ్యమైంది. ఇది బ్యాటరీకి మొదడు లాంటింది. ఉష్ణోగ్రత, లోవోల్టేజీ, విద్యుత్ ను తనిఖీ చేస్తుంది. వాటిని సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది.
బ్యాటరీ వేడెక్కితే, దాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉండాలి. ప్రముఖ బాండ్ల వాహనాల్లో ఈ సిస్టమ్ ఉంటుంది.
బ్యాటరీ బాక్స్ దెబ్బతినకుండా చూసుకోవడం చాలా అవసరం. దీని కోసం ప్రముఖ కంపెనీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయి.
బ్యాటరీలో, వాహనంలో ఏవైనా ఇబ్బందులు కలిగితే స్క్రీన్ లేదా ఫోన్ యాప్ లో హెచ్చరికలు వచ్చే టెక్నాలజీ ఉండాలి.
వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసే ముందే వివిధ పరీక్షలు జరిపాలి. వాటిలో డ్రాప్, వాటర్ రెసిస్టెన్స్, వైబ్రేషన్, థర్మల్ పరీక్షలు ఉంటాయి. ప్రముఖ బ్రాండ్లు ఈ పరీక్షలు చేసిన తర్వాాతే వాహనాలను విడుదల చేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..