
ప్రజల ఆలోచనా విధానం మారిపోయింది. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడటం లేదు. లగ్జరీ జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎంత డబ్బును అయిన వెచ్చించడానికి సిద్దపడుతున్నారు. అందుకు ప్రధాన ఉదాహరణ నివాస గృహం. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో అత్యధిక శాతం మంది పెద్ద ఇళ్లలో సౌకర్యవంతంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనారాక్ తెలిపింది. దేశంలో ప్రముఖ నగరాల్లో సంస్థ చేసిన సర్వే డేటా ప్రకారం లగ్జరీ విల్లాలు, అపార్టుమెంట్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోని టాప్-7 నగరాల్లో సగటు ఫ్లాట్ సైజులు ఏటేటా పెరుగుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే ప్రజలు కోరుకుంటున్న ఫ్లాట్ పరిమాణం ఈ సారి 11 శాతం పెరిగిందని వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయితే ఈ ఫ్లాట్ పరిమణాల్లో తగ్గుదలే కాదు కొన్ని నగరాల్లో తగ్గయని కూడా అనారాక్ చెప్పింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్), కోల్కత్తా నగరాల్లో మాత్రమే ఇది తగ్గిందని తెలిపింది. ఎంఎంఆర్లో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 840 చదరపు అడుగులు కాగా 2023లో 794 చదరపు అడుగులకు తగ్గాయి. అంటే 5 శాతం వార్షిక క్షీణత. కోల్కతాలో, సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 1,150 చదరపు అడుగుల నుంచి 2023లో 1,124 చదరపు అడుగులకు తగ్గాయి. అంటే 2 శాతం క్షీణతను చూసాయి. అయితే గత 5 సంవత్సరాల కాలంతో పోల్చితే సగటు ఫ్లాట్ సైజులు 12 శాతం పెరిగాయి. 2019లో నగరంలో సగటు ఫ్లాట్ పరిమాణం 1,000 చదరపు అడుగులుగా ఉంది.
అనారాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా పెద్ద-పరిమాణ గృహాలకు డిమాండ్ ప్రారంభమైందని.. అది కొనసాగుతోందని చెప్పారు. రానున్న కాలంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..