
Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్లో బంగారం ధరలు పెరుగులు పెడుతున్నాయి. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పండగ సీజన్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంటే అదే బాటలో వెండి పయనిస్తోంది. సోమవారం (నవంబర్ 1)న దేశీయంగా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,600 ఉండగా, చెన్నైలో రూ.68,900 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.64,600 ఉండగా, కోల్కతాలో రూ.64,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.64,600 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో రూ.68,600 వద్ద ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.68,900 ఉండగా, విజయవాడలో రూ. 68,900 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి: