
EPF Contributions: సిస్టమ్లో ప్రధాన అప్గ్రేడ్ జరుగుతున్నందున సెప్టెంబర్, అక్టోబర్ 2025కి సంబంధించిన పీఎప్ విరాళాల పాస్బుక్ ఎంట్రీలు కొన్ని రోజుల పాటు కనిపించకపోవచ్చు అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పేర్కొంది. అనేక మంది వినియోగదారులు తమ పాస్బుక్లలో విరాళాలు మిస్ అయ్యాయని ఫిర్యాదు చేసిన తర్వాత EPFO ఈ వివరణ జారీ చేసింది.
ఈపీఎఫ్ఓ తన ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) లెడ్జర్ పోస్టింగ్ సిస్టమ్ను అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కారణంగా ఈ రెండు నెలల పాస్బుక్ ఎంట్రీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ తెలిపింది. అప్డేట్ రెండు రోజుల్లో పూర్తవుతుందని, ఎంట్రీలు స్వయంచాలకంగా అందరికి కనిపిస్తాయని సంస్థ పేర్కొంది. ఉద్యోగులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని సూచించింది. ఇప్పటికే కొందరికి ఎంట్రీలు కనిపించినా.. కనిపించని వారు టెన్షన్ పడవద్దని, వారికి కూడా రెండు రోజుల్లోనే కనిపిస్తాయని ఈపీఎఫ్ఓ తెలిపింది.
ఇది కూడా చదవండి: 5 Day Week for Banks: 2026లో బ్యాంకుల పని దినాలు వారానికి 5 రోజులేనా?
ఈ అసౌకర్యానికి ఈపీఎఫ్వో విచారం వ్యక్తం చేసింది. సభ్యుల సేవలను మరింత సజావుగా చేయడానికి సాంకేతిక మెరుగుదలలు చేస్తున్నట్లు తెలిపింది. క్లెయిమ్ దాఖలు, ఖాతా యాక్సెస్ వంటి లక్షణాలకు అప్గ్రేడ్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
లెడ్జర్ అప్గ్రేడ్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ 2025 కి సంబంధించిన అన్ని ఎంట్రీలు పాస్బుక్లో స్వయంచాలకంగా అప్డేట్ అవుతాయి. ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ను ఖచ్చితంగా తనిఖీ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Maruti Suzuki EV: మారుతి నుంచి ఎట్టకేలకు విడుదలైన ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే..
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే సంపద తరిగిపోవడానికి ఏన్నేళ్లు పడుతుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి