PACL Investors: పీఏసీఎల్‌ పెట్టుబడిదారులకు ఉపశమనం.. మొబైల్‌ నవీకరించడానికి అనుమతి..

మొబైల్ నంబర్ మార్పు కారణంగా పత్రాలను సమర్పించలేని PACL పెట్టుబడిదారులు సెబీ కమిటీ నుంచి ఉపశమనం పొందారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నత-పవర్ కమిటీ శుక్రవారం PACL పెట్టుబడిదారులు వారి మొబైల్ నంబర్‌లను నవీకరించడానికి అనుమతించింది...

PACL Investors: పీఏసీఎల్‌ పెట్టుబడిదారులకు ఉపశమనం.. మొబైల్‌ నవీకరించడానికి అనుమతి..
Sebi

Updated on: Jun 18, 2022 | 6:24 AM

మొబైల్ నంబర్ మార్పు కారణంగా పత్రాలను సమర్పించలేని PACL పెట్టుబడిదారులు సెబీ కమిటీ నుంచి ఉపశమనం పొందారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నత-పవర్ కమిటీ శుక్రవారం PACL పెట్టుబడిదారులు వారి మొబైల్ నంబర్‌లను నవీకరించడానికి అనుమతించింది. ఇదే కాకుండా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి పెట్టుబడిదారులకు పంపిన SMSను ట్రేస్ చేసే సౌకర్యం కూడా అందించారు. ఏప్రిల్‌లో PACL చట్టవిరుద్ధమైన పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు SMS అందుకున్న తర్వాత మాత్రమే జూన్ 30 లోపు తమ అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను సమర్పించాలని కమిటీ కోరింది. క్లెయిమ్ మొత్తం రూ. 10,001 నుండి రూ. 15,000 మధ్య ఉన్న దరఖాస్తులు ధృవీకరించిన పెట్టుబడిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. PACL గ్రూప్ కేసులో పెట్టుబడిదారుల డబ్బును తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి RM లోధా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

SEBI వెబ్‌సైట్‌లో విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, మొబైల్ నంబర్‌లో మార్పు కారణంగా ఒరిజినల్ PACL సర్టిఫికేట్‌ల కోసం SMS అందకపోవడంపై పెట్టుబడిదారుల నుండి కమిటీ ప్రశ్నలను స్వీకరిస్తోంది. జూన్ 30లోగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సెబీ ఇన్వెస్టర్లను కోరింది. అయితే దీనికి షరతు ఏమిటంటే పెట్టుబడిదారులు దీని కోసం SMS వచ్చినప్పుడు మాత్రమే తమ పత్రాలను సమర్పించాలి. చాలా మంది పెట్టుబడిదారులకు వారి ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల SMS అందడం లేదు. కమిటీ సూచనల ప్రకారం పెట్టుబడిదారులు వారి కొత్త ఫోన్ నంబర్‌ను నమోదు చేయగలరు. ఆ తర్వాత వారికి SMS వస్తుంది. MSS పొందిన తర్వాత పెట్టుబడిదారుడు PACL సర్టిఫికేట్, PACL రసీదుల కాపీని పొందుతారు.