Revolt EV Bike: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఆకర్షిస్తున్న రివోల్ట్ నయా ఈవీ బైక్..!

|

Mar 30, 2025 | 3:06 PM

భారతదేశంలో ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఈ ఈవీ వాహనాల్లో ఎక్కువగా ఈవీ స్కూటర్లే అమ్మకాల్లో టాప్‌లో ఉన్నాయి. ఈవీ బైక్స్ మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నా వాటి కొనుగోలుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే రివోల్ట్ కంపెనీ ఈవీ బైక్స్‌లో నూతన బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. స్పీడ్ పికప్‌తో పాటు ఐసీఈ మోటర్స్ బైక్‌లో వచ్చే వివిధ ఫీచర్లతో వస్తుంది.

Revolt EV Bike: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. ఆకర్షిస్తున్న రివోల్ట్ నయా ఈవీ బైక్..!
Revolt Ev Bike
Follow us on

ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వివిధ కంపెనీలు వివిధ రకాల బైక్‌లు, స్కూటర్‌లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే ఈవీ బైక్స్ విషయంలో ఏ కంపెనీ తన హవా చూపించడం లేదు. దీంతో ఆ మార్కెట్‌ డిమాండ్‌ను అందుకునేందుకు అన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా రివోల్ట్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రానిక్ బైక్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ బైక్‌లో అనేక రకాల హైటెక్ ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు పెద్ద టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

రివోల్ట్ ఈవీ బైక్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ బైక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఈ బైక్‌ను ఇంట్లో ఉన్న సాధారణ సాకెట్ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు సౌండ్ ఫ్రీగా ఉంటాయి కానీ ఈ బైక్ నడుపుతున్నప్పుడు సాధారణ పెట్రోల్ బైక్ అనుభూతిని కలిగించడానికి అధునాతన ఏర్పాటు చేసింది. అంటే ఈ బైక్‌లో కృత్రిమ సౌండ్ సిస్టమ్ ఉంది. ఇది రైడర్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ బైక్ నడుపుతున్నప్పుడు, పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ అనుభూతినిచ్చే విధంగా దీని సౌండ్ వస్తుంది. ఈ బైక్‌లో రివర్స్ గేర్‌లో ఉన్నప్పుడు కూడా ఈ సౌండ్ వస్తుంది. 

ఈ బైక్‌లో కస్టమర్‌కు ప్రత్యేక భద్రతా ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ బైక్ లాక్ మోడ్‌లో ట్యాంపర్ చేస్తే భద్రతా అలారం వెంటనే మోగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపిక కూడా ఉంది. దీని ద్వారా వినియోగదారుడు తన ఫోన్ నుండి బైక్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బైక్ కొనుగోలు సమయంలో ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. రివోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర మార్కెట్లో రూ.1 లక్ష 56 వేలకు అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో గొప్ప ఎంపికగా అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 వేల రూపాయల వరకు సబ్సిడీని ఇస్తోంది. సబ్సిడీ పొందిన తర్వాత ఈ బైక్ ధర మార్కెట్లో దాదాపు రూ.లకు లభిస్తుంది. 1 లక్ష 56 వేలకే కొనుగోలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి