2వేల నోటుకు గుడ్‌బై.. బ్లాక్ మనీ బ్రేకేసేందుకేనట..!!

| Edited By: Pardhasaradhi Peri

Oct 15, 2019 | 7:06 PM

ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే రూ.2వేల నోట్లు చాలా కరువయ్యాయి. ఏటీఎంల నుంచి కూడా రూ. 2వేల నోట్లు రావడం లేదు. అయితే మీకో షాకింగ్ విషయం తెలుసా.? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఈ విషయం ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయ్యాయంటూ  ఓ దినపత్రిక కోరిన ప్రశ్నకు సమాధానంగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్లాక్ […]

2వేల నోటుకు గుడ్‌బై.. బ్లాక్ మనీ బ్రేకేసేందుకేనట..!!
Follow us on

ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే రూ.2వేల నోట్లు చాలా కరువయ్యాయి. ఏటీఎంల నుంచి కూడా రూ. 2వేల నోట్లు రావడం లేదు. అయితే మీకో షాకింగ్ విషయం తెలుసా.? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఈ విషయం ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయ్యాయంటూ  ఓ దినపత్రిక కోరిన ప్రశ్నకు సమాధానంగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్లాక్ మనీకి బ్రేక్ వేసేందుకు రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ నిలిపివేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.

దీనిపై ప్రముఖ ఎకనమిస్ట్ నితిన్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘పెద్ద నోట్లను ఆపడం వలన బ్లాక్‌మనీ లావాదేవీలకు ఇబ్బంది కలుగుతుంది. కానీ నోట్ల రద్దుతో పోలీస్తే ఈ చర్య ఒక రకంగా చాలా మంచిదే. చాలా యూరోపియన్ దేశాల్లో నల్లధనానికి బ్రేక్ వేసేందుకు ఇలా పెద్ద నోట్లను అప్పుడప్పుడు రద్దు చేస్తుంటారు’’ అని పేర్కొన్నారు. కాగా 2016 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను ఉన్నట్లుండి రద్దు చేసి.. ఆ తరువాత రూ.2వేల నోటును సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆర్టీఐ వివరాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ.2వేల నోట్లను ప్రింట్ చేశారు. ఇక 2017-18లో ఈ సంఖ్య కాస్త తగ్గి.. 111.507మిలియన్‌కు చేరింది. ఆ తరువాత 2018-19లో 46.690మిలియన్ రూ.2వేల నోట్ల ముద్రణ మాత్రమే జరిగింది. దీని బట్టి చూస్తుంటే.. భవిష్యత్‌లో రూ.2వేల నోట్లు కనిపించవని సుస్ఫష్టంగా అర్థమవుతోంది.