
పేద కుటుంబాల్లోని మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్తో పాటు మరిన్ని ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టౌవ్, సిలిండర్ ఉచితంగా అందజేస్తారు. ప్రతి సిలిండర్పై రూ.300 రాయితీ లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది.
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబంలో ఎవరికీ ఇదివరకే ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1 లక్ష, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించి ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
దరఖాస్తు సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి.
మీరు ఇంటి వద్ద నుండే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు..
మొదట అధికారిక వెబ్సైట్ www.pmuy.gov.in సందర్శించండి.
హోమ్ పేజీలో Apply for New Ujjwala 2.0 Connection పై క్లిక్ చేయండి.
మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.
మీ మొబైల్ నంబర్కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ ఫామ్లో పేరు, అడ్రస్, ఆధార్, బ్యాంక్ వివరాలను జాగ్రత్తగా నింపండి.
చివరగా దరఖాస్తును సబ్మిట్ చేసి, ఆ ప్రింటవుట్ను దగ్గర పెట్టుకోండి.
మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం తెలియకపోతే, దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్లు వెరిఫై అయిన తర్వాత కనెక్షన్ మంజూరు అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి