PM KISAN: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్‌! డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఆర్థిక సహాయం పొందాలంటే ప్రతి ఏటా ఇ-కేవైసీ పూర్తి చేయాలి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ధృవీకరణ ప్రక్రియ ప్రారంభమైంది, జూన్ 30లోగా పూర్తి చేయని వారికి తదుపరి వాయిదాలు నిలిచిపోతాయి.

PM KISAN: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్‌! డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
Pm Kisan

Updated on: May 13, 2026 | 7:58 AM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇకపై ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ధృవీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, జూన్ 30లోగా పూర్తి చేయని వారికి తదుపరి వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, పీఎం-కిసాన్ పథకంలో నమోదైన ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా వార్షిక ఇ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వారికి మాత్రమే భవిష్యత్తులో పథకం ప్రయోజనాలు అందుతాయని తెలిపింది.

రైతులు ఈ ధృవీకరణను మూడు విధాలుగా పూర్తి చేసుకోవచ్చు. మొదటి పద్ధతిలో గ్రామ సేవకులు, గ్రామ నోడల్ అధికారులు సహాయంతో PM-KISAN మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ చేయించుకోవచ్చు. రెండో పద్ధతిలో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా ఇ-గ్రామ్ కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవచ్చు. మూడో పద్ధతిలో రైతులే స్వయంగా PM-KISAN యాప్‌లో లాగిన్ అయి ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అధికారుల ప్రకారం ఒక రైతు యాప్ ద్వారా తన ఇ-కేవైసీ పూర్తి చేసిన తర్వాత మరో 100 మంది లబ్ధిదారులకు కూడా ఫేస్ ఆథెంటికేషన్ చేయడంలో సహాయం చేయవచ్చు. గ్రామాలకు దూరంగా ఉద్యోగాలు లేదా ఇతర పనుల కోసం వేరే ప్రాంతాల్లో ఉంటున్న రైతులు కూడా ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని శాఖ స్పష్టం చేసింది.

2019లో ప్రారంభమైన PM-KISAN పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000ను మూడు విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే నకిలీ లబ్ధిదారులను గుర్తించడం, అర్హులకే నిధులు చేరేలా చూడడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇ-కేవైసీని కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ధృవీకరణ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే తదుపరి వాయిదా జమలో ఆలస్యం లేదా నిలిపివేత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us