
PM Kisan: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మీ ఖాతాకు రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పీఎం కిసాన్ రాకుంటే రకరకాల కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అసంపూర్ణమైన e-KYC, ఆధార్-బ్యాంక్ లింక్ లేకపోవడం, అసంపూర్ణమైన భూమి ధృవీకరణ లేదా బ్యాంక్ వివరాలలో తప్పులు కావచ్చు. మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఇంటి నుండే e-KYC చేయవచ్చు లేదా సమీపంలోని CSC కేంద్రంలో బయోమెట్రిక్స్తో ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సమస్య కొనసాగితే Kisan హెల్ప్లైన్ 1800-180-1551ని సంప్రదించి మీ నిలిచిపోయిన వాయిదాను తిరిగి పొందవచ్చు.
ఇది కూడా చదవండి: ఖరీదైన కారు నంబర్ ప్లేట్.. దీని ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
20వ విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2025 ఆగస్టు 2న వారణాసి నుండి విడుదల చేశారు. కానీ ఈ మొత్తం ఇంకా వేలాది మంది రైతుల ఖాతాలకు చేరలేదు. మీరు కూడా వారిలో ఒకరైతే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిలిచిపోయిన వాయిదాను తిరిగి పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతో తెలుసా?
వాయిదా ఎందుకు నిలిచిపోతోంది?
చాలా మంది రైతుల ఖాతాలోకి వాయిదాలు రాకపోవడం వెనుక వివిధ కారణాలు ఉండవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవడం ముఖ్యం.
e-KYC ఎందుకు చేయించుకోవాలి?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందడానికి E-KYC అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. e-KYC లేకుండా మీకు డబ్బులు రావు. మీ మొబైల్ నంబర్ ఆధార్తో అనుసంధానించబడి ఉంటే మీరు ఇంట్లో కూర్చుని కూడా దీన్ని పూర్తి చేయవచ్చు.
ఇంటి నుండే e-KYC :
మొబైల్ నంబర్ ఆధార్ తో లింక్ కాలేదా?
మీ మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ చేయకపోతే మీరు సమీపంలోని సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లాలి. మీ e-KYC బయోమెట్రిక్స్ ద్వారా అక్కడ పూర్తి చేసుకోవచ్చు.
సమస్య కొనసాగితే ఎక్కడ సంప్రదించాలి:
e-KYC, అన్ని ఇతర దిద్దుబాట్ల తర్వాత కూడా వాయిదా మీ ఖాతాలోకి రాకపోతే మీరు నేరుగా కిసాన్ హెల్ప్లైన్ నంబర్ 1800-180-1551 కు కాల్ చేయవచ్చు. ఇక్కడ నుండి మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగే మీరు సరైన సమయంలో మీ సమస్యను పరిష్కరించుకుంటే నిలిచిపోయిన వాదాయి వస్తుంది. లేకుంటే రాకపోవచ్చు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో రెండు విమానాశ్రయాలు.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి