
Aadhaar offline verification: ఆధార్ కార్డ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది. భద్రత దృష్ట్యా ఏవోక నిబంధనలు మార్చుతూ వెళ్తోంది. తాజాగా ఆధార్ కార్డుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. అదేంటంటే. .ఇక నుంచి మీరు ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్, అపార్ట్మెంట్కు వెళితే ఆధార్ యాక్సెస్ త్వరలో తప్పనిసరి కావొచ్చు. వెరిఫికేషన్ కోసం ఇప్పటికే చాలా ప్రదేశాల్లో ఆధార్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధన ఉంది. త్వరలో రెస్టారెంట్లు లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఆధార్ను తప్పనిసరి చేయనుంది. ఈ విధానాన్ని తెచ్చేందుకు UIDAI కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం ఏదైనా పనికోసం ఆధార్ ఉపయోగించాలంటే ఆన్లైన్లో ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకునే విధానం అందుబాటులో ఉంది. కానీ త్వరలో ఆఫ్లైన్ విధానంలో కూడా వెరిఫికేషన్ చేసే విధానం తీసుకారుంది. దీని కోసం ఓ కొత్త యాప్ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న విధానంలో చాలా ప్రదేశాల్లో తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ చూపించడంతో పాటు జిరాక్స్ కాపీని అందించాల్సి వస్తుంది. దీని వల్ల జిరాక్స్ కాపీని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. దీనిని అరికట్టేందుకు ఆఫ్లైన్ ఐడీ చెక్ను UIDAI ప్రవేశపెట్టనుంది.
ఈ కొత్త విధానంలో ఆధార్ వివరాలు ఏమీ కనిపించకుండా.. కేవలం క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే ఉండేలా కొత్త యాప్ తీసుకురానుంది. ఇందుకోసం ‘ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్’ అనే సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే సెక్యూరిటీ కోసం స్టేడియాలు, సినిమా హాళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో కూడా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టే అవకాశముంది. ఇలా జరిగితే ప్రతీఒక్కరూ తమ ఆధార్ కార్డును ఎల్లప్పుడూ తమ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..