
ప్రజలకు ఉచిత ఎయిర్ కండిషనర్లు (ఏసీలు)ను అందిస్తామని హామీ ఇస్తూ ప్రభుత్వం ‘పీఎం మోదీ ఏసీ యోజన 2025’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ పథకం కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారని, నమోదు చేసుకున్న వ్యక్తలు 30 రోజుల్లోపు 5 స్టార్ ఏసీ డెలివరీ పొందవచ్చని ఆ వార్తలో ఉంది. ఈ పథకం కోసం 1.5 కోట్ల ఏసీలు సిద్ధం చేశారని, ఈ నేపథ్యంలో భారతదేశంలో భారీగా ఏసీల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు యూపీఎస్సీ మేటర్స్ అనే ఇన్స్టా పేజీలో ఈ పోస్ట్ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు ఉచితంగా 5-స్టార్ ఏసీను పొందేందుకు అర్హులని ఆ పోస్ట్లో ఉంది. ముఖ్యంగా ఏసీలు లేనివారికి 50 శాతంతగ్గింపు పొందవచ్చని పేర్కొంది. అయితే ఆ పోస్ట్లోని లింక్ క్లిక్ చేస్తే వినియోగదారులు రిజిస్ట్రేషన్ కోసం బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ వెబ్సైట్కు వెళ్తుంది.
అయితే ఈ వైరల్ పోస్ట్ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పీఐబీ అధికారిక హ్యాండిల్ ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక పోస్ట్ ‘పీఎం మోదీ ఏసీ యోజన 2025’ అనే కొత్త పథకం కింద ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండిషనర్లను అందిస్తుందని, అలాగే 1.5 కోట్ల ఏసీలు ఇప్పటికే సిద్ధం చేశారనే వార్త ఫేక్ అని స్పష్టం చేసింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డేటా ప్రకారం ఈ తరహా పథకమే లేదని పేర్కొంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ అలాంటి పథకాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు.
A post being widely shared on social media claims that under a new scheme ‘PM Modi AC Yojana 2025’, the Government will provide free 5-star air conditioners and 1.5 crore ACs have already been prepared. #PIBFactCheck
❌This claim is #FAKE
❌No such scheme providing free 5-… pic.twitter.com/6MMJZdI2tV
— PIB Fact Check (@PIBFactCheck) April 18, 2025
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి