
Mukesh Ambani: గత వారంలో షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇన్వెస్టర్లు మాత్రం భారీ లాభాలను గడించారు. మే 1న సెలవు కావడంతో గత వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. ఈ స్వల్ప కాలంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) ఊహించని రీతిలో పెరిగింది.
భారీ లాభాలు: గత నాలుగు పనిదినాల్లో రిలయన్స్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 1.39 లక్షల కోట్లు పెరిగింది. ఈ కాలంలో రిలయన్స్ షేరు సుమారు 9 శాతం మేర లాభపడింది. తాజా పెరుగుదలతో రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 19.36 లక్షల కోట్లకు చేరుకుంది.
టాప్ పెర్ఫార్మర్: సెన్సెక్స్లోని టాప్-10 కంపెనీల్లో రిలయన్స్ అత్యధిక లాభాలను ఆర్జించి మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్తో పాటు టీసీఎస్ (TCS), భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ కూడా లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి: Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?
ఒకవైపు రిలయన్స్ దూసుకుపోతుంటే, మరోవైపు బ్యాంకింగ్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీలు మాత్రం నష్టాలను చవిచూశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ విలువ సుమారు రూ. 30,900 కోట్లు పడిపోయింది.
HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా రూ. 20,900 కోట్లకు పైగా తగ్గింది.
ICICI Bank: ఈ బ్యాంక్ ఇన్వెస్టర్లు కూడా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ తన నంబర్-1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఇది కూడా చదవండి: WhatsApp: సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి