
Mukesh Ambani: భారతదేశంలోని బిలియనీర్ల విషయానికి వస్తే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ. భారతదేశంలో సంపద విషయంలో ఆయనకు సాటిలేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ ఏ స్థానంలో ఉన్నారో మీకు తెలుసా? ప్రస్తుత (ఏప్రిల్ 2026) గణాంకాల ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఆయన ర్యాంకింగ్ మారుతూ ఉన్నప్పటికీ, తాజాగా ఆయన 20వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?
జియో నెట్వర్క్ ప్రస్తుతం 50 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 2026లో ఈ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ప్లాన్ ఉంది. 2023లో ఆయన ముగ్గురు పిల్లలు – ఆకాష్ (జియో), ఈషా (రిటైల్, ఫైనాన్షియల్), అనంత్ (ఎనర్జీ) రిలయన్స్ బోర్డులో చేరారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అంబానీ రిలయన్స్ వ్యాపారాన్ని కూడా విస్తరించారు. ఈ సంస్థ రాబోయే పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అదనంగా, ఈ సంస్థ తన రిఫైనరీ సమీపంలో ఒక కొత్త కాంప్లెక్స్ను నిర్మించనుంది.
ఇది కూడా చదవండి: Silver Price: మహిళలకు శుభవార్త.. ఏకంగా రూ.50 వేలు తగ్గిన వెండి ధర.. ఇంకా తగ్గుతుందా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న మరికొందరు ప్రముఖులు:
స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు మారిన ప్రతిసారీ అంబానీ ఆస్తి విలువ, ర్యాంకింగ్లో మార్పులు సహజం. అయితే, భారతీయ కుబేరుల జాబితాలో మాత్రం ఆయన సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. రిలయన్స్ను ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ 1966లో ఒక చిన్న వస్త్ర వ్యాపారంగా ప్రారంభించారు. 2002లో ఆయన తండ్రి మరణానంతరం, అంబానీ, ఆయన తమ్ముడు అనిల్, కుటుంబ వ్యాపారాన్ని తమ మధ్య పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Cheapest Fuel: ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్.. లీటర్ ధర కేవలం 3 రూపాయల లోపే..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి